తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించారు. రూ.5 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారు సాలిగ్రామ హారం, 4.65 కిలోల బంగారు కంఠె ను కేసీఆర్ సమర్పించారు. అంతకుముందు, రంగనాయకుల మండపంలో తెలంగాణ ప్రభుత్వం స్వామి వారికి బహూకరించనున్న ఈ బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులు ప్రదర్శించారు. వీటిని తన కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ తిలకించి, ఏడు కొండల వాడి దర్శనానికి వెళ్లారు.