ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి ప్రధాని మోదీ వార్నింగ్!

national |  Suryaa Desk  | Published : Tue, Dec 07, 2021, 04:34 PM

పార్లమెంట్‌ సమావేశాల్లో బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎంపీలకు ఆయన గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీలు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే మార్పులు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్‌ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. చిన్న పిల్లలకు చెప్పినట్లు ప్రతిసారీ దీని గురించి చెప్పడం బాలేదని, ఎంపీలకు ఆయన వార్నింగ్‌ ఇచ్చినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com