ఆమె భర్త ఆర్మీ జవాన్.. తానేమో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్. కానీ ఆమె బుద్ధి గాడి తప్పింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ అఫైరే ఆమె ప్రాణం పోవడానికి కారణం అయింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నటరామ్పల్లి కి చెందిన శివ (40) ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. 2009లో మురుగమ్మల్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. మురుగమ్మల్ కలర్పతి ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. అయితే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం శివకు తెలిసింది. దీంతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది.
ఓ వైపు విడాకుల కేసు కోర్టులో ఉన్నప్పటికీ మురుగమ్మల్ మాత్రం భర్త ఇంట్లోనే ఉంటోంది. ఇదిలా ఉంటే ఆ ఇల్లు తనదని ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని శివ తండ్రి మణి కోడలికి తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో మామ కోడలికి మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరగడంతో వంట గదిలో ఉన్న కత్తితో ఆమె మామ మురుగమ్మల్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తానే బైక్పై వెళ్లి తన కోడలిని చంపానని పోలీసుల ఎదుట మణి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.