చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేసారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. కోవూరు సౌబిడి కాలానిలోని వరద బాధితులకు ఆర్థిక సాయం చేసిన. మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేదని చంద్రబాబు అనడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. సంక్షేమ పథకాల కోసం ఇప్పటికే ప్రభుత్వం లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందని, లబ్ధిదారుల అకౌంట్ లోకి నేరుగా డబ్బులు జమావుతున్నాయని గుర్తు చేశారు.
జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు అందరూ సంతోషంగా ఉంటే చంద్రబాబు మతిభ్రమించి మానసిక రోగిలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇక జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని నారావారిపల్లెకే చంద్రబాబు పరిమిత కావాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు కంటున్న కలలన్నీ కలులగానే మిగిలి పోతాయి ఆయన అన్నారు.