విజయవాడ నగర శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో ఓ అపార్ట్మెంట్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఐదుగురు అగంతకులు కర్రలు చేతబట్టుకుని, చెడ్డిలపై అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించారు. అర్ధరాత్రి అలికిడి అవ్వటంతో అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ యజమాని క్యారీడార్ లో లైట్లు వేయడంతో ఆగంతకులు పరారైయ్యారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆగంతుకుల దృశ్యాలు చూసిన స్థానికులు చెడ్డి గ్యాంగ్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.