ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రెడ్డి పాలెం గ్రామం వద్ద పొన్నలూరు చెరువులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం కలుగలేదు. వివరాల్లోకి వెళితే కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కందుకూరు నుండి కనిగిరి వైపు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో పొన్నలూరు చెరువు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. చెట్లు అడ్డం ఉండటం వల్ల చెరువులోకి పడకుండా ఆగిందని ప్రయాణికులు తెలిపారు.