ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని వాహనదారులకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 02, 2021, 11:47 AM

ఏపీ రవాణాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు వేయాలంటూ ఆదేశించింది. ఇప్పటివరకు వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా అంతగా పట్టించుకోలేదు. కానీ ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తనిఖీలు నిర్వహించి, జరిమానాల ద్వారా రూ.352 కోట్లు రాబట్టాలని రవాణాశాఖ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకు రూ.70 కోట్ల వరకు వసూళ్లయ్యాయి. తనిఖీలు పెంచి మార్చిలోగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలని నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com