ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాట క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్కంఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2017, 10:54 AM

తమిళనాడులో క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. అన్నాడీఎంకేలో కూడికలు తీసివేతలు నేడు ఒక కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ విద్యాసాగరరావు ముంబై నుంచి చెన్నై చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు అన్నాడీఎంకే పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాలు సమావేశం ఏర్పాటు చేయనున్నాయి. ఈ సమావేశం అనంతరం విలీన ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం వర్గంలోని ఇద్దరు నేతలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు శశికళ వర్గంతో దినకరన్ సమవేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట ఏం జరుగనుందనే ఉత్కంఠ పెరుగుతోంది. అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ డీఎంకే ఆసక్తిగా గమనిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com