పాట్నా : బీహార్ లో వరద పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. తాజాగా రాష్ట్రంలోని ఆరారియీ జిల్లాలో ఒక బ్రిడ్జి కుప్పకూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. వరద ముంపునకు గురైన ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు జిల్లాలోని ఒక గ్రామ ప్రజలు వరద ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్న ఒక బ్రిడ్జి దాటాల్సి ఉంది. బ్రిడ్జి ఏ క్షణాన్నైనా కుప్పకూలే అవకాశం ఉండటంతో వారు చిన్న చిన్న గుంపులుగా ఆ బ్రిడ్జి దాటుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు తమ వంతు వచ్చినపు్పడు బ్రిడ్జి దాటుతున్నారు. మరో అడుగు వేస్తే వారు సురక్షితంగా బ్రిడ్జి దాటేసి ఉండేవారు. కానీ ఆ ఒక్క అడుగు తేడాలోనే బ్రిడ్జి కుప్పకూలింది. వారిలో ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు.