అమరావతి : ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు భారతదేశంలోని అన్ని నదుల అనుసంధానం ఏపీలో జరగాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. నదుల అనుసంధానంతో జల వివాదానికి తెరపడుతుందని, ఇందుకోసం పార్లమెంటరీ కమిటి కృషి చేయాలని సీఎం కోరారు. భూగర్భ జలాల పెంపునకు దేశమంతా దృష్టి పెట్టాల్సి ఉందని, ఏపీలో భూగర్భ జలాల పెంపునకు సుమారు 5 లక్షల పంటకుంటలు ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.