భారత ఉప రాష్ట్రపతిగా తెలుగు వారైనా వెంకయ్య నాయుడు భాద్యతలు చేపట్యారు. ... భారత రాజకీయాలలో చిరపరిచితుడైన వెంకయ్య బీజేపీలో పోస్టర్లు వేసే సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉపరాష్ట్రపదవిని అలంకరించే స్థాయి వరకూ ఎదిగారు. బీజేపీకి అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా, సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. బీజేపీకి మాతృసంస్థ అయిన జనసంఘ్లో కార్యకర్తగా 1970లో వెంకయ్య దిగ్గజ నేతలైన అటల్బిహారీ వాజపేయి, ఎల్కే అద్వానీల పోస్టర్లు వేసేవారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొనే వెంకయ్య అనతికాలంలోనే నాయకునిగా ఎదిగారు.