ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. బుధవారం రాత్రి ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహానికి హాజరై బైక్ పై వస్తుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డగించారు. భర్తను కొట్టి, భార్యను కత్తులతో బెదిరించి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.