నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేష్ కుటుంబ సభ్యులు కు ఐదు లక్షల చెక్ ను అందచేసిన పవన్ప వన్ కళ్యాణ్ కామెంట్స్....కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారు. జన సైనికులను కోల్పోవడం నన్ను వ్యక్తిగతంగా ఎంతో బాధించింది ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించాం. ప్రాణాలను ఫణంగా పెట్టి జన సైనికులు ముందుకు వెళుతున్నారుఈ భీమా పథకానికి నా వంతుగా కోటి రూపాయలు ఇచ్చాను. ప్రజా స్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కృషి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితి లో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుంది మీ అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దాం