ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిలీప్ కుమార్ మృతికి సంతాపం తెలిపిన ఏపీ గవర్నర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 07, 2021, 12:48 PM

బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ గా ప్రసిద్ది చెందిన దిగ్గజ నటుడు శ్రీ దిలీప్ కుమార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్  విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ శ్రీ దిలీప్ కుమార్ విభిన్నమైన నటనతో భారత సినీ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారని, విభిన్న తరాల నటులకు ఆయన ప్రేరణ అని అన్నారు.  శ్రీ దిలీప్ కుమార్ ఐదు దశాబ్దాల తన కెరీర్ లో దేశం గర్వించదగ్గ గొప్ప నటులలో ఒకరిగా నిలిచారన్నారు. దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు గవర్నర్ శ్రీ హరిచందన్ తన హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com