కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి పేరిట నేటి నుంచి పాదయాత్ర చేయనున్నారు. కానీ పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరిస్తున్నారు. ముఖ్యంగా కిర్లంపూడి ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది. కోనసీమ వ్యాప్తంగా 95 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు ఉంటేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ముద్రగడ ఇంటిముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కిర్లంపూడిలో 144 సెక్షన్, జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంది. అనుమానితులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం 6 వేల మంది పోలీసులు భద్రత నిర్వర్తిస్తున్నారు.