దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 44 వేల 978 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అదే సమయంలో కరోనా కాటుకు 547 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 87 లక్షల28 వేల 795కు చేరింది. కరోనా మృతుల సంఖ్య లక్షా 28 వేల 688కి పెరిగింది.