కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచంలోని అనేక ఫార్మా కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కంపెనీల జాబితాలో భారత్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కూడా ఉంది. ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)తో కలిసి ఈ వ్యాక్సిన్ను రూపొందించే ప్రయత్నంలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియను హైదరాబాద్లోని నిమ్స్లో మొదలుపెట్టింది.క్లినికల్ ట్రయల్స్కు అంగీకరించిన వ్యక్తుల నుంచి రక్త నమూనాలు నిమ్స్ వైద్యులు సేకరించనున్నారు. రక్త నమూనాలు పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించిన వారికి మాత్రమే వాక్సిన్ డోస్ ఇవ్వనున్నారు. ట్రయల్స్లో భాగంగా ఒక్కో వ్యక్తికి మూడు డోసులు ఇస్తారు. మొదటి డోస్ ఇచ్చిన తర్వాత ఆస్పత్రిలోనే రెండ్రోజులు పర్యవేక్షణలో వారిని ఉంచుతారు. అనంతరం 14 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తారు. వ్యాక్సిన్ తయారీలో క్లినికల్ ట్రయల్స్ కీలక దశ అని వైద్యనిపుణులు తెలిపారు.