కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా మంది కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో కరోనా అన్ని ప్రభుత్వ శాఖల్లోకి విస్తరిస్తోంది. తాజాగా రైల్వే శాఖలో 872 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా సెంట్రల్ రైల్వేలో 559 మంది, వెస్ట్రన్ రైల్వే నుంచి 313 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా వల్ల 86 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.