కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కరోనా రోజురోజుకు ఉదృత రూపం దాలుస్తోంది. శుక్రవారం ఒక్కరోజే ఎమ్మిగనూరులో 11 కొత్త కేసులు నమోదయ్యాయి అని మున్సిపల్ కమిషనర్ రగునాథ్ రెడ్డి అధికారులు తెలిపారు. దీంతో అధికారులు కరోనా కట్టడికి చర్యలు కఠినంగా చేపట్టనున్నారు. అందులో భాగంగా పట్టణంలో కేసులు ఉన్న ప్రాంతంలో శనివారం కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.అక్కడ ఏ దుకాణాలు తెరవకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు. నాన్ కంటోన్మెంట్ జోన్ లో అన్ని దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే తెరవాలని, ఆ తరువాత దుకాణలు తెరిస్తే కఠిన చర్యలు చేపడతాం అని తెలిపారు. ఎమ్మిగనూరులో కంటోన్మెంట్ జోన్లుగా హెచ్బీఎస్ కాలనీ, గీతనగర్, కుమ్మరి స్ట్రీట్, కోర్ట్ రోడ్, శారదా కమిటీ స్కూల్ ఏరియా, ఇందుర నగర్, గోనెగండ్ల, చున్నాంబట్టి రోడ్లు, తెరుబజార్, మల్లారివిది, శివన్న నగర్, వడ్డే సంఘం ఏరియా, ఎంఎస్ నగర్, ఎస్ఎంటీ కాలనీ, చౌడేశ్వరీ వీధి, రాఘవేంద్ర కాలనీలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు.