బరువు తగ్గాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు కొన్ని ప్రత్యేక పండ్లు తినాలి. చాలామంది వర్షాకాలంలో వేడి వేడి టీ, మసాలా వంటకాల్ని తినడానికే ఇష్టపడతారు. కానీ పండ్లు తినడానికి ఆసక్తి చూపరు. కాలం ఏదైనా పండ్లను తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని పండ్లను తప్పకుండా తీసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో ఎక్కువగా దొరికేవి నేరేడు పండ్లు. నేరేడును పండ్లలో రాజు అని కూడా అంటారు. ఇందులో కేలొరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి. అజీర్తి సమస్యను ఇవి తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి పెంచడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రోజూ ఓ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు. వర్షాకాలంలో జీవక్రియల రేటు కాస్త నిదానంగా ఉంటుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్ ముక్కలు తింటే ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉంటాం. అరటిలో విటమిన్లూ, మినరల్స్ అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంది. అజీర్తి సమస్య ఉండదు. పిల్లలకు రోజూ ఓ పండు తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి అందడమే కాదు, పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది. విటమిన్ 'సి' అధికంగా లభించే బొప్పాయి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువ. అయితే బొప్పాయిని మితంగా తీసుకుంటేనే మంచిది. కరోనా విజృంభిస్తున్న సమయంలో బయటకు వెళ్లడం ప్రమాదకరం. కానీ, మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ ను సంప్రదించడం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో మీకో శుభవార్త. ఈ యాప్ తో ఇంటి దగ్గర నుండే డాక్టర్ ను సంప్రదించి వైద్య సలహాను పొందవచ్చు. అందుకోసం ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి.