భారత్ లో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 8909 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. కేంద్ర ఆరోగ్య నివేదిక ప్రకారం.. భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 207615కి చేరింది. గత 24 గంటల్లో 217 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5815కి పెరిగింది. నిన్న 4776 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 100302కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 101497కి చేరింది.