ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు. అప్రమత్తంగా లేకపోతే కష్టమే అని అన్నారు. ఢిల్లీ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చిన వారి శాంపిల్స్ సేకరించామని అన్నారు. ప. గో జిల్లాలో ఎటువంటి లక్షణాలు లేని వారికీ పాజిటివ్ వచ్చింది. పట్టణాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని మంత్రి పిల్లి సుభాష్ అన్నారు. ప్రతి ఒక్కరూ సామజిక దూరం పాటించాల్సిందే అని అన్నారు. ఆక్వారైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.