పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలా పెంపులు, తగ్గింపులు ఉంటున్నాయో... వంటగ్యాస్ రేట్ల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. తాజాగా మార్చి 1 నుంచి సబ్సిడీ కాని వంటగ్యాస్ బండ రేట్లు తగ్గించారు. 2019 ఆగస్టులో ఇలా తగ్గించారు. మళ్లీ ఇప్పుడే అది చూస్తున్నాం. అయితే తగ్గింది కదా అని మనం సంతోష పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆరు నెలలుగా వంటగ్యాస్ బండ ధరలు ఆరుసార్లు పెంచారు. తాజాగా ఢిల్లీ, ముంబైలో సబ్సిడీ కాని వంటగ్యాస్ బండ 14.2 కేజీల బరువు ఉండే దాని ధరను రూ.53 రూపాయలు తగ్గించారు. ఇది గత నెల మార్చి లో జరిగింది. కానీ గతేడాది ఆగస్టు నుంచీ ఫిబ్రవరి మధ్య వంటగ్యాస్ ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. అందువల్ల ఇప్పుడు తగ్గించినా పెద్దగా తగ్గించినట్లు కాదనే అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ వల్ల లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో నేడు ఎల్పిజి సిలిండర్ ధరలను రూ. 65 రూపాయల వరకు తగ్గించారు. ఇది సిలిండర్ వినియోగదారులకు ఒక శుభవార్తే. లాక్ డౌన్ నేపథ్యంలో సామాన్యులు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో గ్యాస్ వినియోగదారులను ఆదుకోవడానికి సిలిండర్ పై రూ.65 తగ్గించారు. అయితే కమర్షియల్ అవసరాలకు అంటే హొటల్స్ లల్లో వాడే గ్యాస్ ధర గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇక పోతే గ్యాస్ ధర తగ్గడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. ఈ రోజు తగ్గించిన ధర ప్రకారం చూసినట్లైతే 14.2 కేజీల సిలిండర్ల ధర ఢిల్లీలో 744 రూపాయలు అవుతుంది. కోల్కతాలో రేటు రూ .774.5 (మునుపటి ధర 839.5), ముంబైలో రూ.714.5 (అంతకుముందు ధర రూ. 776.5), చెన్నైలో 761.5 (అంతకుముందు ధర రూ .826)గా ఉంటుంది. ఈ ధరలన్నీ ఈ రోజునుంచే అమల్లోకి వస్తాయి.