సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఈ నెల 25న ఐలాపురంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ముస్లిం, మైనార్టీ వర్గాలకు ఆహ్వానం పంపామన్నారు. రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేయబోమని వచ్చే అసెంబ్లిd సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ బిల్లును కేంద్రం ఉపసంహరించుకునే వరకూ మా పోరాటం ఆగదన్నారు.