టీటీడీకి త్వరలో సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు సృష్టించి టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ స్పష్టం చేశారు. 2 వేల 300 కోట్ల టీటీడీ సొమ్మును ట్రెజరరీకి బదిలీ చేశారని.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరమలపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని భక్తులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.