ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2020, 12:09 PM

ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది.. ఓ నివేదికను బయటపెట్టింది. గత ఆరేళ్లలో రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందట. ఈఎస్ఐ డైరెక్టర్లు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారు.


ఈఎస్‌ఐ రవికుమార్, రమేష్, విజయను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే.. 135శాతం అధికంగా టెండర్లలో చూపించిన సంస్థలు నకిలీ కొటేషన్లతో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు అక్రమంగా రూ.85కోట్లు చెల్లించారు. స్కామ్‌లో ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మాసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు సహకరించినట్లు తేలింది. ఈ ముగ్గరు డైరెక్టర్ల హయాంలో రూ.100కోట్ల నకిలీ బిల్లులు గుర్తించారు.


ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని రిపోర్ట్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారట. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి చేశారని.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు చెప్పారని రిపోర్ట్‌లో వెల్లడించారట. ఈ స్కామ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com