మందడం ఘటనపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నిన్న మందడంలో సచివాలయం వెళ్లే వాహనాలు అడ్డుకున్నారు. క్రిష్టాయపాలెం ఘటనపై నమోదైన కేసులు ఎత్తివేయాలని రైతులు రోడ్డుపై భైఠాయించారు. మహిళలు స్నానాలు చేసేటప్పుడు డ్రోన్ ద్వారా వీడియో తీశారన్నది అవాస్తవం అని అయన తెలిపారు. కొంతమంది కావాలనే పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. జేఏసి కన్వీనర్ శ్రీనివాస్ ను కులం పేరుతో ఎవరూ దూషించలేదు అని అన్నారు. కులం పేరుతో ఎవర్ని మేము దూషించలేదు .