త్రిమూర్తి శివ జయంతిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం తుని బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో సోమనాథ్ శివలింగాన్ని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజులపాటు సోమనాథ శివలింగం భక్తులకు ఇక్కడ దర్శనం ఇస్తుంది. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మాధవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకోవాలి అన్నారు. బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో సోమనాథేశ్వరుని వజ్రాల శివలింగము 22 వ తేదీన తుని పట్టణమునకు చేరుకుంటుందని, ఇక్కడ నుండి 25 వ తేదీ వరకు ఆధ్యాత్మిక జాగృతి కల్గించుటకు రథయాత్ర గ్రామాల్లో పర్యటిస్తుది అన్నారు. పరమ శివుని దర్శించికొని జన్మను చరితార్థం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో మంతెన సూర్యనారాయణరాజు, మద్దుల రామారావు, త్రిమూర్తి స్వామి, కామరాజు తదితరులు పాల్గొన్నారు.