సీఏఏ, ఎన్ఆర్సీ ని వ్యతిరేకిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమిళనాడు అసెంబ్లీ నుంచి 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా తమిళనాడు అసెంబ్లీ వద్ద 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వాలాజా రోడ్ నుండి రాష్ట్ర సచివాలయం వైపు భారీగా జనం ర్యాలీలో పాల్గొన్నారు.