సీఎం జగన్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ ను కోరారు. 14 ఏళ్ల క్రితమే వైఎస్సార్ ఆలోచన చేశారని అయన గుర్తు చేశారు. హైకోర్టు బెంచుకు రాజమండ్రి అనుకూలమని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటును పరిశీలించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.