నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెల్లూరులో మంత్రి నారాయణను పరామర్శించారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగినపుడు అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే నారాయణతో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే నెల్లూరు చేరుకుని నారాయణను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.