అమరావతి: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ తెలిపింది. కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. రానున్న నాలుగైదు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. అంతేగాక ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఇస్రో హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ సూచించింది.