విజయవాడ, సూర్యబ్యూరో : ఆలయ మర మ్మత్తుల్లో భాగంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో చేపట్టిన తవ్వకాల్లో గురువారం ఓ గుప్తనిధి బయటపడటం అందరినీ ఆశ్చర్యా నికి గురి చేసింది. శ్రీశైలం మహా క్షేత్రం లోని పంచమఠాల పునర్ని ర్మాణంలో భాగంగా గుడి వెనుక భాగం లోఉన్న మఠంలో ఈ నిధి బయట పడింది. మరమ్మతుల్లో భాగంగా కొంత లోతుగా గుంత లను తవ్వడంతో ఒక వెండి గిన్నె బయట పడింది. అందులో 50 పంచలోహ నాణాలు, 18 బంగారు నాణాలు, అరకిలోకి పైగా ఉన్న బంగారు కడియాలు, 147 వెండి నాణాలు, ఒక కుంకుమ భరిణి ఉన్నాయి. దీంతో తవ్వకాల్లో బయటపడ్డ నిధి వివరాలను స్థానిక తహశీల్దారుకు అధికారులు తెలియపరిచారు. అనంతరం పోలీసుల సమక్షంలో ఆలయ అధికా రులు నిధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం లభ్యమైన నిధి ఏ కాలానికి సంబంధించిందో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అదే సమయంలో తవ్వకాల్లో మరిన్ని నిధులు బయటపడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ అధికారులు తవ్వకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.