(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : రాజధానిలో విద్యారం గానికి మరో మణిపూసగా అభివర్ణిం చదగిన ఇండో-యూకే హెల్త్ ఇనస్టి ట్యూట్కు వచ్చే నెల 28న శంకుస్థాపన చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు భావి స్తున్నారు. ఈ ప్రతిషా‘త్మక విద్యా సం స్థను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియలోని పురోగతిపై విజయవాడలో సీఆర్డీఏ ఉన్నతాధికారులతో వారు విస్తతంగా చర్చించారు. ఇంగ్లండ్గ మంత్రి, కొందరు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరుల సమక్షంలో శంకుస్థాపనకు ప్రతిపాదించారు. కొన్ని అంశాలపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలిసింది. ఇరుపక్షాలూ గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు కష్ణాయపాలెం వద్ద ఏర్పాటు చేయనున్న ఈ వైద్యసంస్థకు అనుబంధంగా 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఇండో-యూకే హెల్త్ ఇనస్టిట్యూట్ నిర్మించాల్సి ఉంది. అయితే తాజా చర్చల్లో 200 పడకల ఆస్పత్రిని మ్త్రామే నిర్మిస్తామని ఈ సంస్థ ప్రతినిధులు చెప్పారని సమాచారం. ఇందుకు సీఆర్డీఏ ఉన్నతాధికా రులు అంగీకరించలేదని సమాచారం. ఒప్పందం ప్రకారం 1000 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తమ యాజమాన్యానికి తెలిపి నిర్ణయం తీసుకుంటామని ఇనస్టిట్యూట్ ప్రతినిధులు తెలియజేశారు. సమావేశంలో ఇండో-యూకే హెల్త్ ఇనస్టిట్యూట్ సీఈవో అజ య్ రాజన గుప్తా, గ్రూప్ కమర్షియల్ డైరెక్టర్ రిచర్డ్ మిల్లర్, ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధి ఉదయ్ ముంజల్, సీఆర్డీఏ స్ట్ట్రాజీ డైరెక్టర్ జేఎస్సార్కే శాస్తి్ర తదితరులు పాల్గొన్నారు.