ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్బంగా చేనేతలకు ఆర్థిక సాయంపై చర్చ జరిగింది. చేనేత కుటుంబాలకు ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం’ పేరుతో ఆర్థిక సాయం చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా చేనేత కుటుంబాలకు ఏటా డిసెంబర్ 21న బ్యాంకు ద్వారా రూ.24వేలు ఇవ్వనున్నారు. ఈ పథకానికి రూ. 216 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారని సమాచారం.