ప్రకాశం జిల్లా :కొండచిలువను చూస్తేనే భయపడతాం. అదే కొండచిలువ ఇంట్లోకి చొరబడితే హడలిపోవాల్సిందే. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్టతండాలో అదే జరిగింది. ఇంట్లోకి వచ్చిన కొండచిలువను చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని స్థానికుల సాయంతో అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. కొండచిలువను బంధించి సమీపంలోని అటవీప్రాంతంలో విడిచిపెట్టాలని అటవీఅధికారులకు వారు విజ్ఞప్తి చేశారు.