పోలవరం రివర్స్ టెండర్ల వల్ల రూ.7500 కోట్ల నష్టం వస్తుందని చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. చంద్రబాబు పాలించిన ఐదేళ్లలో రూ.5లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. వరుస కరవు వల్ల వ్యవసాయరంగం రూ.లక్ష కోట్ల ఉత్పత్తి కోల్పోయిందని, వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది చంద్రబాబు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు