చెరువులో , బస్సులో, ఇంట్లో అద్దం ముందు, లవర్ తో , నే ఎలా ఉన్నా .. ఇలా అన్నింటికీ ఓ సెల్ఫీ దిగడం.. సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఎంతమంది చూసి కామెంట్లు చేసారని పదే పదే చూసుకోవటం నేటి తరం యువతది అంతా ఇదే వరుస. ఈ సెల్ఫీల కోసం ఇటీవల ప్రాణాల మీదకు తెచ్చుకున్న చాలామంది గురించుకుంటున్న ఘటనలు జరిగాయి. అయితే ఓ పురాతన కట్టడం వద్ద సెల్ఫీ కోసం కక్కుర్తి పడిన ఓ కుర్రాడు జైలుపాలు అయిన ఘటన కర్నాటకలో జరిగింది. అసలు విషయం ఏంటంటే.. కర్ణాటకలోని చారిత్రక నగరమైన హంపీ విజయనగర సామ్రాజ్య కళా, సాహితీ సౌరభాన్ని కళ్లకుగట్టే నిలయం. హంపీని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో కూడా గుర్తించింది. అలాంటి మహోన్నత పురాతన కట్టడాలకు ముప్పు కలిగించడం నేరమంటూ ఆ ప్రాంతంలో హెచ్చరికలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతానికి పర్యటనలకు వచ్చిన నాగరాజు అనే కుర్రాడు పురాతన స్థంభాలపై చేయి వేసి సెల్ఫీలు దిగాడు.. అంతవరకు బాగానే ఉన్న ఆ స్థంభాలలో అయ్యగారు చెయ్యి ఇలా తీసారో లేదో ఎడా పెడగా రెండు పురాతన స్తంభాలు అకస్మాతుగా కూలిపోయాయి.
ఇంకేమంది.. ఏం చేయాలొ అర్ధం కాక అక్కడినుంచి తప్పించుకు పోవాలని భావించిన నాగరాజుని పట్టుకున్న కొందరు సెక్యూరిటీకి అప్పగించారు. ఇక్కడి నిర్వాహణ కమిటీ ఫిర్యాదులో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. అతడిపై 1958నాటి పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు అతడిని హాజరు పరచగా 15 రోజుల జుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కేసు విచారణ తదుపరి పెద్ద శిక్ష పడే ఆస్కారం ఉందని కొందరు చెప్పారు. సెల్ఫీ మోజుతో జైలుపాలై చింతిస్తున్నాడు నాగరాజు.. ఉరఫ్ సెల్ఫీరాజు. మీరూ ఈ సారి సెల్ఫీ తీసుకునేందుకు ఓ సారి ముందు వెనకలు కూడా ఆలోచించుకోండి.