రెండు రోజుల కిందట పశ్చిమబెంగాల్ లోని జాదవ్ పుర యూనివర్సిటీని సందర్శించిన సమయంలో కేంద్రమంత్రి బబూల్ సుప్రియోపై విద్యార్థి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన కు సంబంధించి సీసీటీవీ ఫ్యూటేజీల ఆధారంగా దాడికి పాల్పడింది దేభంజన్ బల్లవ్గా గుర్తించిన మంత్రి సుప్రియోతన ట్విట్టర్ ఖాతాలో దాడి ఫోటోలను పోస్ట్ చేశారు. అయితే ఆ విద్యార్థిపై కేసు పెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్న నేపథ్యంలో కొడుకును ఏంచేస్తారోనని విద్యార్థి తల్లి ఎంతగానో తల్లడిల్లి పోయింది. దీంతో మంత్రి సుప్రియో విద్యార్థి భవిష్యత్తు నాశనమవుతుందని, ఆతనిపై ఎలాంటి కేసు పెట్టొద్దని పోలీసులను ఆదేశించారు.
అయితే ఆదివారం తన మంది మార్బలంతో దేభంజన్ బల్లవ్ ఇంటికి వచ్చిన మంత్రిగారి పుత్ర రత్నం ఏం చేస్తాడోనని అక్కడి వారంతా భయపడిపోయారు అయితే తొందరబాటులో మీ కుమారుడు ఏదో తెలియక చేసుంటాడని అసలు ఈ విషయంలో కేసుఉండబోదని చెప్పేందుకు వచ్చానంటూ భరోసా ఇవ్వటంతో ఆ తల్లి ఊపిరి పీల్చుకుంది. దీనికి తోడు ట్విట్టర్ వేదికగా, ప్రియమైన పిన్ని గారు, శోకించకండి. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఏ విధమైన కేసు పెట్టను. ఎవ్వరు కేసు పెట్టకుండా చూసుకుంటాను అని అభయం ఇచ్చాడు.ఇది కాస్తా వైరల్ కావడంతో మంత్రి అభిమానులతో పాటు నెటిజన్లు సైతం మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు..