మంగళ వారం సాయంత్రం వైద్య చికిత్స పొందుతూ గుండె పోటుతో హఠాన్మరణం చెందిన బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు దేశంలోని ప్రముఖులంతా నివాళులు అర్పిస్తున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ బుధవారం ఉదయం సుష్మ నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సుష్మ స్వరాజ్ కుటుంబీలను ఓదార్చి , తమా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. మరో వైపు సుష్మా మరణంతో బీజేపీ శోకసంద్రంలో మునిగిపోయింది. పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పిస్తూ దేశంలో ఎక్కడికక్కడ సంతాప సభలు ఏర్పాటు చేస్తున్నాయి.