విజయవాడ, సూర్య బ్యూరో : వెలగపూడి సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగు లందరూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పని సరిగా పాటించాని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు వారానికి 5 రోజు లు పనిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, అందువల్ల ఉద్యోగులు అందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గత నెల 15 నుంచి సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఉద్యోగి ఉదయం 10 గంటలకు కార్యాలయంలోని తమతమ సీట్లలో వుండాలని కార్యాలయంలోపలికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ డివైస్లో హాజరు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొంత మంది అధికారులు, ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరుకావటం లేదని, సమయం పాలన పాటించక సమావేశాలకు, సమీక్షలకు అందుబాటులో వుండటంలేదని ప్రభు త్వం దృష్టికి వచ్చింది. సచివాలయ అధికారులకు, ఉద్యోగులు బయోమెట్రిక్ విధానాన్ని పాటించే విధంగా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని, ఆ మేరకు ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సెక్రటరీ ప్రతిరోజూ హాజరు వివ రాలు నమోదుచేసి ఆయా శాఖల కార్యదర్శులకు పంపాలని, కార్యదర్శులు హాజరు వివరాలను కన్సాడిడేట్ చేసి నెలవారీ నివేదికను ముఖ్య మంత్రికి, చీఫ్ సెక్రటరీకి పంపించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.