జివియంసిలో ప్రతి సోమవారం నిర్వహించే ”డయల్ యువర్ కమిషనర్” గ్రీవెన్స్సెల్ (ఫిర్యాదులు, విజ్ఞప్తుల స్వీకరణ) వేళల్లో మార్పు చేస్తున్నట్లు కమిషనర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో పేర్కోన్నారు. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదులను ఉదయం 11 గంటల నుండి ఒంటి గంటవరకు స్వీకరిస్తారు. డయల్ యువర్ కమిషనర్ నెంబరు 1800-4250-0009 కు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఫోన్ ద్వారా (టోల్ ఫ్రీ నెంబర్) కు ఫిర్యాదు చేయవచ్చును. కావున ప్రజలు ఈ మార్పును గమనించవలసినదిగా ఆ ప్రకటనలో కోరారు.