తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీపట్టాభి రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం ఉద యం స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభ వంగా జరిగింది. ఉదయం 7.30 నుంచి 8.05 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరాముల వారిని రథాన్ని అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి స్వామి వారి రథోత్సవం మంగళ వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం. బుద్ధి సారధి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రా లు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీ రం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. కాగా సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ధూళి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్ర మంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, స్థానిక ఆలయాల డిప్యూటి ఇఓ వెంకట య్య, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.