ట్రెండింగ్
Epaper    English    தமிழ்

200 మంది మహిళలకు హజ్‌ యాత్రకు అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 08, 2017, 01:07 AM

  విజయవాడ, సూర్యబ్యూరో: మెహరం క్యాటగిరి కింద దరఖాస్తు చేసుకో వడానికి ఆఖరు తేదీ మే 8, 2017. ఏదైనా కారణంతో 2017 హజ్‌యాత్రకు దరఖాస్తు చేసుకోలేక పోయిన 200 మంది మహిళ లకు అవకాశాన్ని సెంట్రల్‌ హజ్‌ కమిటీ కల్పిం చింది. దేశ వ్యాప్తంగా ఈ క్యాటగిరి కింద దరఖాస్తు చేసు కున్న మహిళల్ని డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. అయితే దరఖాస్తు చేసుకోవ డానికి ప్రత్యేకమైన నిబంధనలున్నాయి. 2017 హజ్‌ యాత్రకు సంబంధించి డ్రాలో సెలెక్ట్‌ అయిన వ్యక్తి తాలుకు బంధువులు అంటే ఆ వ్యక్తి ఎవరికైతే మెహరంగా ఉపయోగపడతాడో అలాంటి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసు కోవాలి. అవసరమైన పత్రాలు జతపరిచి దరఖాస్తు నింపాలి. ఏ కారణం చేత 2017 హజ్‌ యాత్రకు దరఖాస్తు చేయలేదు? పాస్‌పోర్ట్‌ కాపీ, ఇతర డాక్యు మెంట్‌లలో మెహరంతో మీకున్న బంధుత్వాన్ని నిర్ధారించే అంశాలు మ్యాచ్‌ కావాలి. భారతదేశానికి చెందిన ముస్లిం మహిళా ఎవరైనా హజ్‌ యాత్రకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు అవసరమైన డాక్యుమెంట్లు రెండు కలర్‌ ఫొటోలు, పాస్‌ పోర్ట్‌ కాపీ, అడ్రస్‌ ఫ్రూఫ్‌ (రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కరెంట్‌ బిల్లు, టెలిఫోన్‌ ల్యాండ్‌ లైన్‌ బిల్లు, వాటర్‌ బిల్లు, గ్యాస్‌ కనెక్షన్‌, ఓటర్‌ ఐడి, ఆధార్‌ కార్డు సొలమన్‌ డిక్లరేషన్‌ జతచేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com