శ్రీళైలం సాక్షి గణపతి ఆలయం వద్ద కారు బీభత్సం సృష్టించింది. కొత్తగా కొన్న కారు వాహన పూజ పూర్తి చేసుకుని నిమ్మకాయలు తొక్కించే క్రమంలో అదుపుతప్పి ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. క్యూలైన్ వద్ద తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్న ఐదుగురు భక్తులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన పూజారిపై అదేవిధంగా కారుపై స్థానికులు దాడి