ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రతపై జాతీయస్థాయిలో ప్రచారం అవసరం

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2019, 02:43 PM

 భద్రతపై జాతీయస్థాయిలో ప్రచారం అవసరమని ప్రసార భారతి ఛైర్మన్‌ ఏ. సూర్యప్రకాశ్‌ అన్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో గల ఓ కోచింగ్‌ సెంటల్‌లో నిన్న సంభవించిన అగ్నిప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. ఈ విషాద సంఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు జాతీయస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రసారభారతి, డీడీ న్యూస్‌ లైవ్‌, ఎయిర్‌న్యూస్‌ అలర్ట్స్‌, డీడీ నేషనల్‌, ఆకాశవాణి తదితర ప్రసార సాధానాలను కోట్‌ చేస్తూ సూర్యప్రకాశ్‌ ట్వీట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com