ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధికాకపోవడానికి అసలు కారణం భూములే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 01:21 AM

విజయవాడ, అమరావతి, సూర్య ప్రతినిధి :  జిల్లా అభివృద్ధి కాకపోవడానికి అసలు కారణం భూములేనని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూములిచ్చిన రైతులకు చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. ఉగాదికి ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఏపీకి 27 టౌన్‌షిప్‌లు, 9 సిటీలు, రెండు ఐకానిక్‌ బిల్డింగ్‌లు వస్తున్నాయని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కూడా సభ్యులు చూడాలన్నారు. రాజధాని, పోలవరం రెండూ మనకు 


ముఖ్యం ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల సహకారం అవసరం సీఎం చంద్రబాబు స్సష్టంచేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు జాతీయస్థాయి గుర్తింపు రావడంపై సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో స్పందించారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్‌‌డ్సలో ప్రాజెక్టు పేరు నమోదు కావటం ఎంతో గర్వంగా ఉందన్నారు. అంతకు ముందు ఇదే విషయంపై మంత్రి దేవినేని అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కృషి వల్లే పట్టిసీమ ప్రాజె్‌ు్ట్క జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని మంత్రి దేవినేని చెప్పారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు


నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఇటీవల వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు. టీడీపీ స్ట్రాటజీ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మూడు రోజుల నుంచి అసెంబ్లీలో వ్యూహం బాగుందన్నారు. వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అగ్రిగోల్‌‌డపై ప్రభుత్వం నిజాయితీగా ఉందన్న విషయం జనంలోకి వెళ్లిందన్నారు. న్యాయ విచారణ జరిపిస్తామంటే ప్రతిపక్ష నేత జగన్‌ పారిపోయారని చంద్రబాబు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ తీర్మానం చేసే సమయంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన ప్రసంగం బాగుందని సీఎం ప్రశంసించారు. ఎస్వీ మోహన్‌ రెడ్డి, జ్యోతుల నెహ్రూ కూడా బాగా మాట్లాడారన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యూహలతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com