విజయవాడ, సూర్య బ్యూరో : 2019 నాటికి పొలవరం నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన లో పోలవరానికి ఇచ్చింది రూ. 562 కోట్లు మాత్రమేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి రూ.2,916కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. పొలవరానికి అవసరమైన నిధులను నాబార్డ్ ఇస్తుందని చెప్పారు. సీఎం కషి వల్లే పట్టిసీమ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్సలోకి వెళ్లిందన్నారు. 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీతో నీళ్లిస్తామన్నారు.