ఢిల్లీ: గత కొంతకాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గడిచిన కొన్ని నెలలుగా విదేశాల్లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది అగస్టులో వారణాసి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటినుంచి విదేశాల్లోను చికిత్స పొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యం కుదుటపడటంతో ఆమె విదేశాల నుంచి ఇండియా తిరిగొచ్చేశారు. అయితే విదేశాల్లో ఆమె ఎక్కడ చికిత్స చేయించుకున్నారన్నది మాత్రం ఇంతవరకు అధికారికంగా తెలియరాలేదు. అదే సమయంలో అమెరికాలో సోనియా చికిత్స చేయించుకుని ఉండవచ్చునని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. శుక్రవారం ఇండియాలో అడుగుపెట్టిన సోనియా గాంధీ వెంట ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.