ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ తో గుజరాత్‌ ఎంపీలు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 05:16 PM

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్ర ఎంపీలతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో దాదాపు 50 మంది ఎంపీలతో మోదీ సమావేశమయ్యారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో జరగనున్న ఎన్నికలపై ఎంపీలతో చర్చించినట్లు సమాచారం. యూపీలో అఖండ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా.. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో కూడా విజయ బావుటా ఎగరేసే దిశగా వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భాజపా జాతీయధ్యక్షుడు అమిత్‌షా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 19ఏళ్లుగా గుజరాత్‌ని పాలిస్తున్న భాజపాకి మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గానూ ప్రస్తుతం 123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ సారి జరిగే ఎన్నికల్లో దాదాపు 150 సీట్లను గెలవాలనే వ్యూహంతో భాజపా ముందుకు వెళ్తొంది. అయితే భాజపాను ఓడించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ఇప్పటికే గుజరాత్‌లో ప్రచారం ప్రారంభించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com